న్యూఢిల్లీ: మార్పులేమీ చేయకుండానే ఎన్నికల సంస్కరణల ఆర్డినెన్స్ను రాష్ట్రపతి అబ్దుల్ కలామ్కు పంపాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి తిప్పికొట్టినవిషయం తెలిసిందే.
ఈ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి తిరిగి పంపినవిషయంపై మంత్రి వర్గం శనివారం చర్చించింది. యధాతదంగా ఆర్డినెన్స్ను తిరిగి రాష్ట్రపతికి పంపాలని మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో నేర ప్రమేయాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంస్కరణల బిల్లును మంత్రి వర్గం ఈ నెల 16వ తేదీన ఖరారు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది.