వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో పోలీస్టేషన్లుపేల్చేసిన నక్సల్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నంఃపీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు శుక్రవారం రాత్రి విశాఖపట్నం జిల్లాలో చెలరేగిపోయారు. రెండు పోలీస్టేషన్లను ధ్వసం చేశారు. ఒక ట్రెజరీ కార్యాలయం కూడ నక్సలైట్లు ఆగ్రహానికి ధ్వంసమైంది. పోలీస్టేషన్‌ పై దాడిచేసిన నక్సలైట్లుపెద్ద ఎత్తున ఆయుధాలను ఎత్తుకెళ్ళారు. ముగ్గురు పోలీసులను కూడా కిడ్నాప్‌ చేసి తీసుకు వెళ్ళారు. నక్సలైట్లు ఈ స్థాయిలో చెలరేగిపోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం.

శుక్రవారం అర్థరాత్రి సుమారు 30 మంది నక్సలైట్లు ఒకమినీబస్సు, హీరోహోండాలపై అనకాపల్లిలో ప్రవేశించారు. పోలీస్టేషన్‌ పై మెరుపుదాడి చేశారు. ఠాణాను బాంబులతోపేల్చి వేశారు. ఆ తరువాత నక్సలైట్లు చోడవరం వెళ్ళారు. 30 మంది నక్సలైట్లు రెండు జట్లుగా విడిపోయి కొందరు చోడవరం పోలీస్టేషన్‌ ను, మరికొందరు ట్రెజరీ ఆఫీసును ధ్వంసం చేశారు. పోలీస్టేషన్ల నుంచి ఆయుధాలుఅపహరించుకుపోవడంతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్ళను కూడా నక్సలైట్లు తీసుకువెళ్ళారు.

ఈ సంఘటనతో పోలీస్‌ యంత్రాంగం ఉలిక్కిపడింది. ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలపర్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురైన విషయంవిదితమే. ఆ సమయంలో పోలీసులు రెచ్చిపోయి ఎన్‌ కౌంటర్లు చేయడంతో దెబ్బతిన్న నక్సలైట్లు ఇంతకాలం అదనుకోసం ఎదురు చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారని భావిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అనకాపల్లి, చోడవరం వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X