ఇంగ్లాండుపై భారత్ ఘనవిజయం
లీడ్స్: ఇంగ్లాండుపై భారత్ మూడో క్రికెట్టెస్ట్ మ్యాచ్లో ఘనవిజయం సాధించింది. భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఇంగ్లాండును ఓడించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండు 309 పరుగులకు అలవుట్అయింది. ఈ విజయంతో సిరీస్ను సమం చేసింది. ఇంతకు ముందు ఒక టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండు గెలిచింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత భారత్ విదేశీ గడ్డపై గెలుపు సాధించింది. 1977-78 సిరీస్లో సిడ్నీటెస్ట్లో గెలిచింది. ఆ తర్వాత విదేశీ గడ్డపై ఇదేవిజయం. రాహుల్ ద్రావిడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. అతను 148 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ను గంగూలీ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత బౌలర్లను కూడా అతను ప్రశంసించాడు.












Click it and Unblock the Notifications
