వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.810 కోట్లతో కరవు నివేదిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరవు సహాయ చర్యలకు 810 కోట్ల రూపాయలుఅందించాలని కోరుతూ తయారు చేసిన నివేదికను రాష్ట్ర అధికారులు పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రతినిధులకు సమర్పించారు. ఫళనీ మాణిక్యం చైర్మన్‌గా ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రతినిధులు సోమవారం రాష్ట్రానికి వచ్చారు.

ఈ ప్రతినిధులు రాష్ట్రంలోని కరవు పరిస్థితులను సమీక్షించారు. పనికి ఆహారం పథకంకింద అదనంగా బియ్యం ఇవ్వాలని కూడా రాష్ట్రాధికారులుకోరారు. మొత్తం 22 జిల్లాల్లోని 836 మండలాల్లో కరవు ఉన్నదని, ఈ ప్రాంతాలకు కరవు సహాయం సాధ్యమైనంత త్వరగాఅందించాలని రాష్ట్రానికి చెందిన అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే విపత్తుల నివారణ నిధి నుంచి 163 కోట్ల రూపాయలు రాష్ట్రానికి విడుదల చేసినట్లు స్థాయి సంఘం ప్రతితినిధులు చెప్పారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ నిధి నుంచి రాష్ట్రం అదనపు నిధులు అడుగుతోందని వారు చెప్పారు. త్వరలో కేంద్రానికి తమ నివేదికను సమర్పిస్తామని స్థాయి సంఘం చైర్మన్‌ పళనీ మాణిక్యం చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X