వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి ఉగ్రరూపం-నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రిః అతివృష్టి, అనావృష్టి.... ఏది వచ్చినా కష్టమే. రాష్ట్రంమొత్తం నిన్న మొన్నటి వరకు అనావృష్టితో అల్లాడిపోయింది. ఇప్పడు రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాలు నదులుపొంగడంతో కష్టాల్లో పడ్డాయి. ముఖ్యంగా గోదావరి నది ఎగువన భారీవర్షాలు పడడంతో గోదావరి పరవళ్ళు తొక్కుతున్నది. ఉపనదులైన పెన్‌గంగ, ప్రాణహిత భీకరరూపం దాల్చాయి. ఆదిలాబాద్‌ డివిజన్‌ లో 20 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. రాజమండ్రి బారేజ్‌ వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదసూచికకు
చేరువలోకి వచ్చింది. భద్రాచలం వద్ద వరదనీరు ఒక్కసారిగా విరుచుకుపడితే ఏం చేయాలని అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది.

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాణహిత నదిని దాటుతూ నలుగురు గల్లంతయ్యారు. నదీప్రవాహంలో కొట్టుకుపోయివీరు మరణించారని భావిస్తున్నారు. రెండు మృత దేహాలు ఇప్పటివరకు బయటపడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచిపెద్దమొత్తంలో నీరు వస్తూ వుండడంతో ముందు జాగ్రత్త చర్యగా కొంత నీటిని సముద్రంలోకి వదలివేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X