వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు డిమాండ్లపై ఎన్టీఏ మౌనం!

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆశతో జరిపిన ఢిల్లీ యాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేదు. కరవు సాయం తదితర పలుప్రతిపదనలతో చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్ళారు. ఉదయం నుంచి రాత్రి వరకు కాళ్ళకు చక్రాలు కట్టుకొని మంత్రులందరినీ కలిశారు. రాష్ట్రపతికలాం ను కలిసి ఆంధ్రను సందర్శించాల్సిందిగాకోరారు. ఉపరాష్ట్రపతి షెకావత్‌ ను కలిశారు. ప్రధాని వాజ్‌పేయి, ఓ డజను కేంద్ర మంత్రులతో చంద్రబాబు బృందం భేటీఅయింది.

రాష్ట్రంలో కరవువిలయతాండవం చేస్తున్నది.... 850 కోట్ల సాయాన్నిఅందించాల్సిందిగా బాబు కోరగా ప్రధాని, అద్వానీ అంతా మౌనం వహించారే తప్ప ఎటువంటి హామీ ఇవ్వలేదు. కరవు పరిస్థితినిఅంచనా వేసేందుకు మళ్ళీ కేంద్రబృందాన్ని పంపేందుకు మాత్రంఓ.కె.అన్నారు. హైదరాబాద్‌ లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ కు అనుబంధంగాసెంటర్‌ ఫర్‌ కార్పొరేట్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు కేంద్రఓ.కె. చెప్పింది. ఇవి తప్ప కరవు పై కానీ, వ్యవసాయ పథకాలు, పెండింగ్‌ ప్రాజెక్టులపై కానీ కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో చంద్రబాబు కాస్త నిరుత్సాహంగా బుధవారం రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్‌ చేరుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X