వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచారణకు ఎమ్మెస్సార్‌ సోదరుడు సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: తాను కరీంనగర్‌ పట్టణంలో భూకబ్జాకు పాల్పడినట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు సోదరుడు అయోధ్య రామారావు అన్నారు.ఎం. సత్యనారాయణరావు కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన సందర్భాల్లోనే అయోధ్య రామారావు దశలవారీగా భూకబ్జాకు పాల్పడివిద్యాసంస్థలను స్థాపించారని బిజెపి ఇటీవల ఆరోపించినవిషయం తెలిసిందే.

బిజెపి ఆరోపణను అయోధ్య రామారావు గురువారంవిలేకరుల సమావేశంలో ఖండించారు. తాను భూమిని సక్రమంగానే పొందానని ఆయన స్పష్టం చేశారు. తాను భూకబ్జాకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణపై ఏవిచారణకైనా సిద్ధమేనని ఆయన అన్నారు. తనపై క్రిమినల్‌ కేసుపెట్టి ప్రాసిక్యూట్‌ చేసినా సిద్ధంగానే ఉన్నానని ఆయన అన్నారు. అయోధ్య రామారావుపై బిజెపి చేసిన ఆరోపణను కాంగ్రెస్‌ పార్టీ కూడా ఖండించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X