వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై ఇంద్రసేన్‌ ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పెట్రోల్‌ పంపుల కేటాయింపులపై కాంగ్రెస్‌ చేస్తున్నవిమర్శలను భారతీయ జనతా లెజిస్లేచర్‌ పార్టీ (బిజెఎల్‌పి) ఖండించింది. శిశువిక్రయాల వ్యవహారంలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ నేతలకుపెట్రోల్‌ పంపుల కేటాయింపుపై తమ మీద బురద చల్లేఅర్హత లేదని బిజెఎల్‌పి నేత ఎన్‌. ఇంద్రసేనారెడ్డి శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

పెట్రోల్‌ పంపుల కేటాయింపు కాంగ్రెస్‌ నాయకులకు కూడా జరిగిందని ఆయ చెప్పారు. కడప జిల్లా పులివెందుల వద్ద ఉన్నపెట్రోల్‌ బంకు కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికి చెందిందే అని ఆయన అన్నారు. 1980 నుంచి జరిగినపెట్రోల్‌ పంపుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వంవిచారణ జరిపించడానికి సిద్ధమవుతుంటే కాంగ్రెస్‌ నాయకులకు గుబులు పట్టుకుందని, ఈవిచారణ జరగాల్సిందేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X