వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆబ్కారీ పోలీసుల హింసకు వ్యక్తి బలి

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఆబ్కారీ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వంకత్తుల వెంకన్న (39) అనే వ్యక్తి మృతి చెందాడు. గుడుంబా తయారు చేస్తున్నాడనే ఆరోపణతో వెంకన్నను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. ఆ చిత్రహింసలకు అతను శుక్రవారంనాడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు ఆందోళనకు దిగారు. వెంకన్న మరణానికి బాధ్యులైన ఆబ్కారీసిఐ, ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను కలెక్టర్‌అరవిందకుమార్‌ సస్పెండ్‌ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం- గుడుంబా తయారు చేస్తున్నారనే సాకుతో వెంకన్నతో పాటు ఆరుగురిని ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకొని నేలకొండపల్లి తీసుకెళ్లారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలోమిగిలిన ఐదుగురిని వదిలేసి, వెంకన్నను తీవ్రంగా కొట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడ్ని గ్రామశివార్లలో వదిలేశారు.మిగిలినవారు ఇళ్లకు చేరుకున్నా తన భర్త రాకపోవడంతో వెతుకుతూ బయలుదేరిన వెంకన్న భార్యకు స్పృహ తప్పి పడి ఉన్న అతను కనిపించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అతడ్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X