ఆబ్కారీ పోలీసుల హింసకు వ్యక్తి బలి

ఖమ్మం: ఆబ్కారీ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వంకత్తుల వెంకన్న (39) అనే వ్యక్తి మృతి చెందాడు. గుడుంబా తయారు చేస్తున్నాడనే ఆరోపణతో వెంకన్నను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. ఆ చిత్రహింసలకు అతను శుక్రవారంనాడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు ఆందోళనకు దిగారు. వెంకన్న మరణానికి బాధ్యులైన ఆబ్కారీసిఐ, ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను కలెక్టర్‌అరవిందకుమార్‌ సస్పెండ్‌ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం- గుడుంబా తయారు చేస్తున్నారనే సాకుతో వెంకన్నతో పాటు ఆరుగురిని ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకొని నేలకొండపల్లి తీసుకెళ్లారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలోమిగిలిన ఐదుగురిని వదిలేసి, వెంకన్నను తీవ్రంగా కొట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడ్ని గ్రామశివార్లలో వదిలేశారు.మిగిలినవారు ఇళ్లకు చేరుకున్నా తన భర్త రాకపోవడంతో వెతుకుతూ బయలుదేరిన వెంకన్న భార్యకు స్పృహ తప్పి పడి ఉన్న అతను కనిపించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అతడ్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+