వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంగా ఏడేళ్ళు నిండిన చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి శనివారం నాటికి ఏడేళ్ళు నిండాయి. ఆంధ్రుల అన్న ఎన్టీఆర్‌ క్యాబినెట్‌ లో ఆర్థిక శాఖమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టినవిషయం విదితమే. ఆ నాటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి హైటెక్‌ ముఖ్యమంత్రిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. తను అధికారం చేపట్టి ఏడేళ్ళు గడచిన సందర్భంగా శనివారం ఆయనవిలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాలకంటే అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లుచెప్పారు.

గుడ్‌ గవర్నెన్స్‌పైన, వ్యవస్థాపరంగా వున్న లోపాలను సవరించుకుంటూ ముందుకుపోవడంపైన ప్రభుత్వం దృష్టి సారిస్తున్నదని ఆయన అన్నారు. గత రెండేళ్ళలో రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధి చెందిందని చంద్రబాబు అన్నారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం ఐదోస్థానానికి చేరిందన్నారు. నక్సలైట్లతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడువిముఖం కాదని, శాంతిభద్రతలు సాధించనిదే అభివృద్ధికిఅర్థం లేదనే విషయం తనకు తెలుసునని చంద్రబాబు అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X