వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక సర్కార్‌ కు సుప్రీం హుకుం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తమిళనాడుకు ప్రతిరోజూ 1.25 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కిర్పాల్‌ సారధ్యంలోని ప్రత్యేక ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు చెప్పింది.సెప్టెంబర్‌ నాలుగోతేదీ నుంచే కోర్టు తీర్పును అమలు చేయాల్సిందిగా ఆదేశించింది.

కావేరీ రివర్‌ అధారిటీ ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకొనే వరకు కోర్టు తీర్పు అమలులో వుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. మెట్టూరు డాం కు రోజూ 1.25 టిఎంసిల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడం కర్నాటక ప్రభుత్వానికిపెద్ద షాక్‌ గా పరిణమించింది. ఇప్పటికే కృష్ణ, తుంగభద్ర జలాల విడుదలవిషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కజ్జాపెట్టుకున్న కర్నాటక ప్రభుత్వం తమిళనాడుతో కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నది. కర్నాటక వైఖరికి నిరసనగా ఇటీవల ప్రధానితో జరిగిన సమావేశం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వాకౌట్‌ చేసినవిషయం విదితమే. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ పై దాఖలు చేసిన పిటిషన్లను ముందుగానే ఉపసంహరించుకొని కర్నాటక ప్రభుత్వం పరువు నిలుపుకొనే ప్రయత్నాల్లో పడింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X