వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీ రాజ్‌ మంత్రికిఎసరు!

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలుః పంచాయతీ రాజ్‌ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. పంచాయతీ రాజ్‌ శాఖలో రెండుకోట్లకుపైగా అక్రమాలకు పాల్పడి, శాఖను సొంతఆస్తిలా వాడుకుంటున్న మంత్రి అల్లుడిపై సత్వరం చర్య తీసుకోవాలని కోరుతూ వామపక్షాలు మంగళవారం కర్నూలు పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. కర్నూలు, అనంతపురం, గుంటూరు పంచాయతీ రాజ్‌ శాఖ కార్యాలయాల్లో స్టేషనరీ కొనుగోళ్ళలో సుమారు రెండు కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై ప్రస్తుతానికి శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నామని, రెండు రోజుల్లో పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని అధికారులు చెబుతున్నారు. ఈ
కుంభకోణానికి బాధ్యత వహించి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి రాజీనామా చేయాలని, అధికారులను బెదిరించి అవినీతికి పాల్పడుతున్న మంత్రి అల్లుడిపై చర్య తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X