వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మకానికి విజయవాడ కాంప్లెక్స్‌ లు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు చెందిన 50 షాపింగ్‌ కాంప్లెక్స్‌ లను అమ్మాలంటూ కమిషనర్‌ తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి దారితీసింది. 50 షాపింగ్‌ కాంప్లెక్స్‌ లను అమ్మడం ద్వారా వచ్చే 100 కోట్ల రూపాయలతో విజయవాడలో డ్రైనేజ్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. తమతో కనీసం సంప్రదించకుండా ఇటువంటి కీలకనిర్ణయం ఎలా తీసుకుంటారంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు రణభేరి మోగించాయి.

కమిషనర్‌ నిర్ణయంపై నాలుగురోజులుగా నిరసన తెలుపుతున్న వామపక్షాలు మంగళవారంవిజయవాడ వచ్చిన మంత్రులు విజయరామారావు, కొత్తపల్లి సుబ్బారాయుడు,ఎం. నరసింహారావులను కలిశారు. ఈ వ్యవహారంపై తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. నగరాన్నిసర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకే కమిషనర్‌ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని, అన్ని వర్గాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రివిజయరామారావు హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X