వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆహారంలో అవినీతి-25మందిపై వేటు

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరుః చిత్తూరు జిల్లాలో పనికి ఆహార పథకంలో అవినీతి జరిగిందని నిర్థారణఅయింది. పనికి ఆహారపథకంలో అవినీతికి పాల్పడిన 25 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం, కిమ్మనపల్లి తదితర ఆరు గ్రామాల్లో పనికి ఆహారపథకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపైవిచారణ జరిగింది. ఈ విచారణలో ముగ్గురు ఎమ్మార్వోలు, నలుగురు ఎండిఓలు, 14 మంది గ్రామాకార్యదర్శులతో పాటు మరికొందరు అక్రమాలు పాల్పడినట్లు రుజువుకావడంతో వారిని సస్పెండ్‌ చేశారు.

ఈ అక్రమాలపర్వంలో కొందరు సర్పంచ్‌ లు, జడ్‌.పి.టి.సిలు, ఎం.పి.టి.సిల హస్తం కూడా వున్నదని నిర్ధారణ కావడంతో వారిపై కూడా చట్టపరమైన చర్య తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పనికి ఆహారపథకంలో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ పథకం తెలుగుతమ్ముళ్ళకు భోజ్యంగా మారిందనే ఆరోపణలు చాలా రోజులుగా వస్తున్నాఒకే సారి ఇంతమంది అధికారులు సస్పెండ్‌ కావడం, అదీ చంద్రబాబు సొంతజిల్లాలో ఇంత మంది సస్పెండ్‌ కావడంవిశేషం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X