వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగిలిన మంత్రులు హరిశ్చంద్రులా?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అవినీతికి పాల్పడిన మంత్రులందరిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్య తీసుకోవాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి శనివారంవిలేకర్లతో మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతున్న మంత్రులుపై చర్య తీసుకోవడంలో కూడా చంద్రబాబు ఆశ్రితపక్షపాతం వహిస్తున్నారని ఆయనవిమర్శించారు.

ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన వారిని మాత్రమే తప్పిస్తున్నారని ఆయనవిమర్శించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నక్సలైట్ల సమస్య పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని సురవరం తప్పు పట్టారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X