వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపు భారత క్రికెటర్లదే

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) ఛాంపియన్‌ ట్రోఫీ స్పాన్సర్‌షిప్‌ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒప్పంద పత్రాల నుంచి రెండువివాదాస్పదమైన నిబంధనలను తొలగించడానికి ఐసిసిఅంగీకరించింది. దీంతో ఐసిసి ఛాంపియన్‌ ట్రోఫీకి భారత్‌ పూర్తి స్థాయి జట్టును పంపేందుకువీలు ఏర్పడింది.

సమస్య పరిష్కారమైనప్పటికీ ఢిల్లీలో తలపెట్టిన బిసిసిఐ అత్యవసర సమావేశం జరుగుతుంది. ఆటగాళ్లు నేరుగా బోర్డుతో చర్చించడానికి నిరాకరించడంపై ఈ సమావేశంలో దృష్టి పెడతారు. నెల రోజుల క్రితం ఎంపిక చేసిన భారత పూర్తి స్థాయి జట్టుకు శనివారం ఆమోద ముద్ర వేస్తారు.

ఛాంపియన్‌ ట్రోఫీ ముగిశాక కూడా 30 రోజుల దాకా క్రికెటర్లు వ్యక్తిగత స్పాన్సర్ల లోగోలను ధరించకూడదని, టోర్నీ ముగిశాక ఆరునెలల దాకా మత చిత్రాలను ఐసిసి ఉపయోగించుకునేందుకు ఆటగాళ్లు సమ్మతించాలని ఐసిసి నిబంధలను విధించింది. భారత ఆటగాళ్లు ఈ నిబంధనలకు ససేమిరా అనడంతో ఐసిసి దిగిరాక తప్పలేదు. ఈ రెండింటిని కాంట్రాక్టు నుంచి తొలగించడానికి ఐసిసిఅంగీకరించింది. ఐసిసితో కుదిరిన ఒప్పందం మేరకు భారత ఆటగాళ్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ జరిగే 18 రోజులు తమ వ్యక్తిగత స్పాష్సర్ల లోగోలను ధరించరు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X