వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదుల అనుసంధానమే పరిష్కారంః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ః దేశంలో వున్న నదులను అనుసంధానం చేయడం ఒక్కటే నదీజలాలవివాదాలన్నింటికీ పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల విడుదలపై కర్నాటక ప్రభుత్వం వైఖరి పట్ల చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టును కూడా కర్నాటక ప్రభుత్వం కావాలనే అడ్డుకున్నదని కరీంనగర్‌ లోవిలేకర్లతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా ఖాతరు చేయడంలేదని, ఈ సమస్యలన్నింటికీ నదులను అనుసంధానం చేయడం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. ఈఅంశంపై ప్రధాని వాజ్‌ పేయి, ఉపప్రధాని అద్వానీతో మాట్లాడానని ఆయన చెప్పారు.విద్యుత్‌ నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. అన్ని డిస్ట్రిబ్యూషన్‌సెంటర్లలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X