వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌరవయాత్రతో బిజెపి ప్రచారభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః ప్రతిపక్ష పార్టీల నిరసన భేరి మధ్య గుజరాత్‌ లో వివాదాస్పద గౌరవ యాత్రకు భారతీయ జనతాపార్టీ ఆదివారం శ్రీకారం చుట్టింది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారపర్వానికి ఈ గౌరవయాత్రను బిజెపి నాందిగా భావిస్తున్నది. మతఘర్షణలతో అట్టుడికిన గుజరాత్‌ లో ఈ గౌరవయాత్ర మరింత కల్లోలానికి దారితీస్తుందనే భయంతో గతంలో ఈ గౌరవయాత్ర ఆలోచనకు ప్రధాని వాజ్‌ పేయి చెక్‌ చెప్పారు.అయితే పార్టీలోని అతివాదుల ఒత్తిళ్ళు, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి పట్టుదల కారణంగా ఈ యాత్ర ప్రారంభమైంది.

క్షత్రియులు అధికంగా వుండే ప్రాంతం నుంచి ప్రారంభంఅయిన ఈ ర్యాలీ కోసం అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్నిఅసెంబ్లీ నియోజక వర్గాలను కలుపుతూ సుమారు ఐదువేల కిలోమీటర్ల దూరం ఈ గౌరవయాత్ర సాగుతుంది. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ ఈ గౌరవయాత్రను లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మోడికి బద్ధశత్రువు శంకర్‌ సింగ్‌ వాఘెలా సొంత నియోజకవర్గంలోని బాగ్వెల్‌ నుంచి గౌరవయాత్రకుశ్రీకారం చుట్టడం మరో విశేషం. ఈ గౌరవయాత్ర కేవలం ఓట్లకోసమేనని, లోక్‌ జనశక్తి పట్టు వున్న ప్రాంతాల్లో గౌరవయాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తామని మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X