వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజామాబాద్‌ లో దొంగల బీభత్సం

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌ః నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలో ఆదివారం వేకువజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏడోనెంబర్‌ జాతీయ రహదారి వెంట వున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిపై 20 మంది దొంగలు విరుచుకుపడ్డారు. దుండగులు ఆస్పత్రి డాక్టర్‌ కస్తూరీ బాయిని తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్తరిటైర్డ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ను రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఆస్పత్రిలోనిపేషెంట్లు అందరినీ గదుల్లో బంధించిన దుండగులు మూడు గంటల పాటు ఆస్పత్రిలోస్వైరవిహారం చేశారు. అందిన మేరకు దోచుకున్నారు.

అడ్డం వచ్చిన ఒక నర్సును తీవ్రంగా గాయపరిచారు. నర్సుతో పాటు 15 మంది ఈ దాడిలో గాయపడ్డారు. దుండగులంతా యువకులని, మరాఠీలో మాట్లాడారని బాధితులు చెప్పారు. కామారెడ్డిలో జరిగిన ఈ సంఘటన నిజామాబాద్‌ లో సంచనలం సృష్టించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X