వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత టీంకు సహారా గుడ్‌ బై!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోనికుందన్‌ బాగ్‌ ప్రాంతంలో ముగ్గురు మహిళలమరణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిస్టరీగా ఉన్న ఈ హత్యల గురించి సమాచారం పంజాగుట్ట పోలీసులకు ఆలస్యంగా తెలిసింది. ఒకదొంగను విచారిస్తుండగా..పంజాగుట్ట పోలీసులకు ఈమహిళల మరణం గురించిన సమాచారం లభించింది.

పోలీసులు వెంటనే కుందన్‌ బాగ్‌ లోని ఓ అపార్ట్‌మెంట్‌ లో నివసిస్తోన్న జయప్రద ఇంటిని తెరవగా బట్టలు లేకుండాపడిఉన్న ముగ్గురు మహిళల శవాలు దొరికాయి.చాలా రోజులుగా మూసి ఉన్న ఈ ఇంటిని పోలీసులే తెరిచారు. ఈమహిళలు వారం రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

దుర్గందం వస్తోన్న ఈ శవాలనుపోస్ట్‌ మార్టమ్‌ కు తరలించారు. నడివయస్కురాలైనజయప్రద విడాకులు పొంది ఒంటరిగానే నివసిస్తోంది. ఆమెఇద్దరు కూతుళ్ళు సుధారాణి, శారదాదేవి కూడాఆమెతోనే ఉండేవారని చుట్టుపక్కల వారు తెలిపారు.మరణం ఎలా సంభవించింది అనేది ప్రస్తుతానికిమిస్టరీగానే ఉన్నా, ఎవరో హత్య చేసే ఉంటారని పంజాగుట్ట ఎసిపి రామారావు భావిస్తున్నారు.

సహజ మరణం అయితేకాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈముగ్గురు మహిళలు దుస్తులుధరించిలేరు. అయితే రేప్‌ జరిగి, హత్య చేశారాఅనేది పోస్ట్‌ మార్టం తర్వాతే తేలుతుందనిఆయన విలేకరులకు తెలిపారు. ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఓదొంగను పోలీసులు విచారిస్తుండగా..ఈ మహిళలమరణం గురించి తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X