రాష్ట్రాలతో చర్చించాకే ఐ.డికార్డ్స్‌!

న్యూఢిల్లీ: నేషనల్‌ ఐడెంటిటీ కార్డ్స్‌ జారీవిషయంలో రాష్ట్రాలతో మరో మారు చర్చలు జరుపుతామని ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ తెలిపారు. దేశంలోని పౌరులందరికీ గుర్తింపు కార్డులను ఇవ్వాలనేది కేంద్రం యోచన. అయితే ఈవిషయంలో కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తున్నామని అద్వానీ బుధవారంవిలేకరులకు తెలిపారు. ఐ.డి. కార్డులు జారీ చేయాల్సింది రాష్ట్రాలే.అందుకే అన్ని రాష్ట్రప్రభుత్వాలతో ఏకాభిప్రాయ సాధనకు కృషిచేస్తున్నామని ఆయన అన్నారు. ఇదివరకు ఒక సారి కేంద్రం ముఖ్యమంత్రులతో సమావేశం జరిపి ఈవిషయమై చర్చింది.

ఈ సమావేశంలో నలుగురు ముఖ్యమంత్రులు అభ్యంతరం తెలిపారు. శాంతిభద్రతలతో పాటు శరణార్థుల వలసలను నిరోధించేందుకు ఈ గుర్తింపు కార్డుల జారీ తప్పనిసరి అని ఆయన అన్నారు. మల్టీ పర్పస్‌ కార్డ్‌ గా దీన్ని మలుస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+