వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ లో హింస; 13 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌ లో తీవ్రవాదులు చెలరేగిపోయారు. కాశ్మీర్‌ లో వివిధ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి జరిపిన దాడులు, కాల్పుల్లో 13 మంది మరణించారు. మరణించిన వారిలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కు చెందిన ఇద్దరు నాయకులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌ లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ బ్లాక్‌ కార్యదర్శి అలీ మొహమద్‌ దార్‌ ను తీవ్రవాదులు కాల్పిచంపారు. ఆయన నివాసంలోకి జొరబడి గుర్తుతెలియనితీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మరణించారు.

మరో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు గులాం రసూలును కూడా కాల్పిచంపారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ ఈ హత్యలకు బాధ్యులమని ప్రకటించలేదు. రాష్ట్రంలోని మరో ఘటనలో పోలీసులకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులుతో పాటు ఒక సాధారణ పౌరుడు మరణించాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X