వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టరీ వీడని కుందన్‌ బాగ్‌ హత్యలు!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని కుందన్‌ బాగ్‌ లోని ఓ ఇంట్లో శవాలుగా బయటపడ్డ ముగ్గురు మహిళల మరణాల కేసులో ఇంతవరకుపురోగతి కన్పించలేదు. కేసును దర్యాప్తును చేస్తోన్న పంజాగుట్ట పోలీసులు కీలకమైన దొంగగా పరగణిస్తున్నశ్రీశైలంను బుధవారం ఇంటరాగేట్‌ చేశారు.

తాను కేవలం ఆ ఇంట్లో దొంగతనం మాత్రమే చేశానని, వారి మరణాలతో తనకు ఎటువంటి సంబంధం లేదనిశ్రీశైలం పోలీసులకు వివరించాడు. శ్రీశైలంతో పాటు మూడ్నెళ్ళుగా జయప్రద ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ దొంగలందరినీ పోలీసులువివరించారు.

ఈ దొంగలనుంచి 11 తులాల బంగారం, కిలో వెండి నగలనుస్వాధీన పర్చుకున్నారు. దొంగలు చోరీకి పాల్పడక ముందేవీరి మరణించి ఉంటారని మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్‌ నివేదిక కూడ ఇంతవరకు పోలీసులకుఅందలేదు. చాలా సంక్లిష్టంగా మారిని ఈ కేసును హైదరాబాద్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు సాగిస్తున్నప్పటికీ కీలకమైన క్లూ దొరకడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X