వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వై.ఎస్‌. ఖైదీని కలవడంపై రగడ

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు సబ్‌ జైల్‌ లో జీవిత ఖైదును అనుభవిస్తోన్న గౌరు వెంకటరెడ్డినిసీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి పరామర్శించడాన్ని తెలుగుదేశం తప్పుపట్టింది. హత్యకేసులో శిక్షను అనుభవిస్తోన్న వ్యక్తి నిసీఎల్పీ నేత కలవడాన్ని బట్టి కాంగ్రెస్‌ సంస్కృతి ఏమిటో తెలిసిపోయిందని టీడీపీ నేతలువిమర్శిస్తున్నారు.

కాంగ్రెస్‌ నేరమయ రాజకీయాలకు పాల్పడుతోందని మరోసారి దీని ద్వారా రుజువైందని కర్నూలుకు చెందిన టీడీపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి విమర్శించాడు. జంట హత్య కేసులో శిక్షను అనుభవిస్తోన్న వ్యక్తిని బాగా చూసుకోండని అధికారులను ఆయన కోరడం మరీ విచిత్రంగా ఉందన్నారు.

సీఎల్పీ నేత అధికారులకు పాఠాలు చెప్పడమేమిటని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఈ వాదనలను వై.ఎస్‌. ఖండించారు.ఆయన నాకు బాగా తెలిసిన వాడు. పైగా అనారోగ్యంగా ఉన్నాడు.అందుకని పరామర్శించేందుకు వెళ్ళాను. అంతేతప్ప నేను అధికారులెవరికీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని వై.ఎస్‌ తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X