వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ ఆలోచన మారలేదు: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ ఆలోచనలో ఏ విధమైన మార్పు రాలేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించే చర్యలకు పాకిస్థాన్‌ పూనుకుంటోందని ఆయనవిమర్శించారు. మాల్దీవుల పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఆదివారం ఉదయం కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు.

ఉగ్రవాద కార్యకలాపాలకుస్వస్తి చెప్పి, ఉగ్రవాదుల మౌలిక వసతులను ధ్వంసం చేసినప్పుడే పాకిస్థాన్‌తో చర్చలకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే ఇండో-పాక్‌ల మధ్య చర్చలకు మార్గం సుగమమవుతుందని అమెరికా చేసిన ప్రకటననువిలేకరులు ప్రస్తావించగా అమెరికా ప్రకటన విషయం తనకు తెలియదని ప్రధాని జవాబిచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగాజరిగితే భారత్‌-పాక్‌ల మధ్య చర్చలకు మార్గం ఏర్పడుతందా అనివిలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X