వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కారంపై 23నసుప్రీం విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కావేరీ జలాల విడుదలలో కర్ణాటక కోర్టు ధిక్కారానికి పాల్పడిందంటూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారంవిచారణకు చేపట్టే అవకాశాలున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ, జలవనరుల మంత్రి హెచ్‌.కె. పాటిల్‌లను, ప్రధాన కార్యదర్శిని, ఇద్దరు ఇంజనీర్లను తమిళనాడు ప్రతివాదులుగా చేర్చింది.

తమిళనాడులోని మెట్టూరు జలాశయానికి రోజుకు 1.25 టిఎంసిల కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఈ నెల 3వ తేదీన జారీ చేసిన ఆదేశాలను గానీ, రోజుకు 0.8 టిఎంసిల జలాలు విడుదల చేయాలని కావేరీ రివర్‌ అథారిటీ ఈ నెల 9వ తేదీన తీసుకున్న నిర్ణయాన్ని గానీ కర్ణాటక అమలు చేయలేదని తమిళనాడు తన పిటిషన్‌లో ఫిర్యాదు చేసింది.ఇప్పటి వరకు పది టిఎంసిల జలాలను విడుదల చేయాల్సి ఉండగా తమకు కర్ణాటక కేవలం 4 టిఎంసిల నీటిని మాత్రమే విడుదల చేసిందని తమిళనాడు తెలియజేసింది. తాము రోజుకు 0.8 టిఎంసిల నీటిని విడుదల చేస్తూ పోతూ జలశయాలు 45 రోజుల్లో అడుగంటిపోతాయని కర్ణాటక తన అఫిడవిట్‌లో తెలియజేసింది. కావాలని కోర్టు ఆదేశాలను తాము ధిక్కరించలేదని,సెప్టెంబరు 4-18 తేదీల మధ్య 8.2 టిఎంసిల నీటిని విడుదల చేశామని కర్ణాటక స్పష్టం చేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X