వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేద సార్క్‌ దేశాలకు రాయితీలు

By Staff
|
Google Oneindia TeluguNews

మాలే: స్వల్ప రాజకీయ ఈర్ష్యాద్వేషాలకు అభివృద్ధిని,పెరుగుదలను బలి పెట్టకూడదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన సార్క్‌ దేశాలకు భారత్‌ సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో ఆర్థిక, వాణిజ్య రాయితీలు ఇస్తుందని ఆయన చెప్పారు.

రాజకీయ ఈర్ష్యాద్వేషాలకు అభివృద్ధిని బలిపెట్టబోమని ఆయన చెప్పారు. నాలుగు రోజుల పర్యటన కోసం వచ్చిన వాజ్‌పేయి గౌరవార్థం మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్‌ అబ్దుల్‌ గయూం సోమవారం మధ్యాహ్నంవిందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి మాట్లాడారు. కొన్ని నిర్హేతుకమైన రాజకీయ కారణాలతో సార్క్‌ దేశాల ఆర్థిక సాన్నిహిత్యానికి విఘాతం కల్పిస్తున్నారని ఆయన పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సార్క్‌ దేశాల మధ్యపేదరిక నిర్మూలన కోసం ప్రాంతీయ సహకారానికి, సమాన ఆర్థికాభివృద్ధికి మరింత సాన్నిహత్యంపెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

గయూంకు, వాజ్‌పేయికి మధ్య జరిగిన ముఖాముఖి చర్చల్లో ఉభయ దేశాల మధ్య సమాచార సాంకేతిక, పర్యాటక, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, మౌలికసదుపాయాలు, తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతపెంచుకోవాలని అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X