వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయలసీమకు అన్యాయం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందనడానికి గాలేరు నగరి ప్రాజెక్టే నిదర్శనమని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గాలేరు నగరి ప్రాజెక్టు పునాదిరాయి వద్ద మొక్కలు నాటారు.

పద్నాలుగేళ్ల క్రితం మాజీ ముఖ్యమంత్రిస్వర్గీయ ఎన్‌.టి. రామారావు శంకుస్థాపన చేసిన గాలేరు నగరిని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదోవివరణ ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులవిషయంలో ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలోని కనకంబాడి, పుత్తూరు, నగరి సభల్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాల్లోనే ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని, అటువంటప్పుడుమిగతా జిల్లాల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X