వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్మట్టి నీటికి కృష్ణకు బాబు లేఖ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆల్మట్టి డ్యామ్‌ నుంచి కనీసం 50 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లేఖ రాయనున్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారంవిలేకరులతో ఈ విషయం చెప్పారు. రాష్ట్రంలో మంచినీటి అవసరాల కోసం మానవతా దృక్పథంతో ఆల్మట్టి నీరు విడుదల చేయాలని కర్ణాటకను ముఖ్యమంత్రి కోరుతారని ఆయన చెప్పారు.

నాగార్జునసాగర్‌ కింది రైతులకు నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. నాగార్జున సాగర్‌ కింద 50 వేల ఎకరాలలో పంట వేసిన రైతులు నష్టపోయారని ఆయన చెప్పారు. నాగార్జున సాగర్‌ నుంచి రైతులకు ఒక చుక్క నీరు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నష్టపరిహారం ఏ మేరకు చెల్లించాలనేవిషయంపై అధ్యయనం చేయనున్నట్లు, ఆ తర్వాతే నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్‌ ఇర్రిగేషన్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌ చేసినవిమర్శలను ఆయన ఖండించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X