వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషార్రఫ్‌పై మండిపడ్డ వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

మాలే: జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్నికలు బూటకమని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌పై భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మండిపడ్డారు. ముషర్రాప్‌ ప్రచారాన్ని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌లోస్వతంత్రంగా ఎన్నికలు జరగలేదని, అందువల్ల ఎక్కడైనస్వతంత్రంగా ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని వారువిశ్వసించలేరని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల మాల్దీవుల పర్యటనలో ఉన్న వాజ్‌పేయి దూరదర్శన్‌కు మంగళవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. పాకిస్థాన్‌ ప్రచారాన్ని ఎవరూవిశ్వసించబోరని, భారత ప్రజాస్వామిక ప్రక్రియను ప్రదర్శించి, నాటకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

మాల్దీవులు, భారత్‌ సంయుక్తంగా తీవ్రవాదాన్ని ఎదుర్కుంటాయని, కోరితే మాల్దీవుల అధికారులకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. సార్క్‌ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పటిష్టం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని, ముఖ్యంగా వాణిజ్యంలో ఈ సహకారంపెంపొందించడం అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X