వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెంట్‌ మంత్రి కొత్తపల్లిఘోరావ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విద్యుత్‌ కోతకు ఆగ్రహించిన రైతులు విద్యుచ్ఛక్తి మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడునుఘెరావ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన సుబ్బారాయుడును రైతులు చుట్టిముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇళ్లకు 24 గంటలువిద్యుత్‌ సరఫరా చేయకపోయినా ఫరవాలేదు గానీ వ్యవసాయానికి తొమ్మిది గంటలకు కచ్చితంగావిద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంట్‌ ఇచ్చి తీరుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ రోజువిద్యుత్‌ సరఫరా కొంత మెరుగుపడిందని, సింహాద్రి నుంచి కరెంట్‌అందుతోందని, ల్యాంకో నుంచి ఒకటి, రెండు రోజుల్లోఅందుతుందని, దీంతో సరఫరా మరింత మెరుడుపడుతుందని ఆయన చెప్పారు. కరెంట్‌ సక్రమంగాఅందించి పంటలను కాపాడి తీరుతామని ఆయన అన్నారు.

ఇదిలా వుండగా, విద్యుత్‌ కోతను నిరసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలువిజయవాడలో ధర్నా చేశారు. వ్యవసాయానికి ఐదు గంటలు కూడా సక్రమంగా కరెంట్‌ ఇవ్వడం లేదని వారువిమర్శించారు. వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలురేగోండ విద్యుత్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X