వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14కు చేరిన ఆర్టీసి బస్సు మృతులు

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలుః ఆర్టీసి బస్సు దగ్ధంఅయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 14కుచేరింది. మరో 14 మంది కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 80 శాతం గాయాలతో వారు మృత్యువుతో పోరాడుతున్నారు.తీవ్రంగా గాయపడిన వారి రోదనలతో కర్నూలు ఆస్పత్రి వాతావరణం హృదయవిదారకంగా వుంది. కడపకు చెందిన మెడికో నీరజారెడ్డి కూడా ఈ ప్రమాదంలో మరణించిందని అనుమానిస్తున్నారు.

ఇది విద్రోహ చర్యా లేక ప్రమాదమా అనేవిషయాన్ని ఎవరూ చెప్పలేక పోతున్నారు. పోలీసులు మాత్రం దీనిని ప్రమాదంగానే భావిస్తున్నారు. బస్సులోఅంతా ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని, బస్సులోమంటలు వ్యాపించాయన ఎవరో అరచిన వెంటనే బస్సును రోడ్డుపక్కకు తీసి ఆపేలోగానే మంటలు బస్సంతా వ్యాపించాయని డ్రైవర్‌ చెప్పారు.వెంటనే కిందకు దిగి కిటికీల అద్దాలు పగులగొట్టిఅందిన వారిని అందినట్లు బయటకు లాగానని డ్రైవర్‌ వివరించాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X