సిటీ శివారులో ముసుగుదొంగల దోపిడి
హైదరబాద్: హైదరాబాద్ శివార్లలో ముసుగు దొంగలు మంగళవారం అర్థరాత్రివీరంగం చేశారు. నాచారం పోలీసు స్టేషన్ పరిధిలోని చెంగిచర్లలో పలు ఇళ్లపై ఈ ముఠా సభ్యులు దాడి చేసి మారణాయుధాలతో బెదిరించి బంగారం, నగదు దోచుకుపోయారు.
ఉస్మానియా యూనివర్శిటీ ఉద్యోగి శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసి తాము అన్నలమని చెప్పి 34 వేల రూపాయల నగదు, 20 తులాల బంగారం దోచుకుపోయారు. ఆ తర్వాత మరో మూడు ఇళ్లపై కూడా దాడి చేశారు. కానీ ఒక మంగళసూత్రం, కొద్ది మొత్తం నగదు మాత్రమే ఈ ఇళ్లలో వారికి దక్కింది.












Click it and Unblock the Notifications
