వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటలిజెన్స్‌ సంస్థలకు అద్వానీ సూచనలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిర్దిష్టమైన సమాచారాన్నిఅందజేయడానికి ప్రయత్నించాలని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ ఇంటలిజెన్స్‌, భద్రతా సంస్థలకు సూచించారు. నిర్దిష్టమైన సమాచారంఅందించినప్పుడు మాత్రమే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు.

మన ఇంటలిజెన్స్‌ పనితీరు బాగానే ఉన్నదని, ఉత్తమమైన జనరల్‌ సమాచారంఅందుతుందని, నిర్దిష్టమైన సమచారం అందడం లేదని, ఇటువంటి సమాచారం ఆధారంగా చర్యలు తీసుకోవడం కష్టమని ఆయన అన్నారు.టాప్‌ ఇంటలిజెన్స్‌, పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ఆదివారం ప్రసంగించారు.

స్వామినారాయణ్‌ దేవాలయానికి 45 మంది ఎన్‌ఎస్‌జి కమెండోలను పంపినివిషయాన్ని ప్రస్తావిస్తూ- వారు చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాలు ఆలస్యమైందని, ఢిల్లీలో ట్రాఫిక్‌జామ్‌ వల్ల వారు విమానాశ్రయానికి చేరుకోవడంలో జాప్యం జరిగిందని ఆయన అన్నారు.

ఈ విధమైన పరిస్థితులను అధిగమించడానికి మార్గాలు వెతకాలని, ఈ సందర్భంలోపెద్ద నష్టం జరగలేదని, అయితే ఈ విధమైన జాప్యం వల్ల నష్టాలుపెద్దగా జరిగే ప్రమాదం ఉండవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X