వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో రైతులరైల్‌ రోకో

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు జి. మాదేగౌడ నాయకత్వంలో దాదాపుప రెండు వేల మంది రైతులు బెంగుళూర్‌రైల్వే స్టేషన్‌లో రైల్‌ రోకో నిర్వహించారు. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా రైతులు ఆదివారంరైల్‌ రోకో నిర్వహించారు.

కన్నడ అనుకూల సంస్థలు వొక్కలిగర సంఘ ప్రతినిధులు, మాండ్యా జిల్లా శాసనసభ్యులు కొందరు రైతు సంఘాల ప్రతినిధులకు మద్దతు ఇస్తున్నారు.రైల్వే ట్రాక్‌ల మీద బైఠాంచి నీటి విడుదలకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. బెంగుళూర్‌స్టేషన్‌ నుంచి దక్షిణ మధ్య రైల్వే రైళ్లను నడిపించడం లేదు. శివారు ప్రాంతాల్లోనిస్టేషన్ల నుంచి రైళ్లను నడిపుతోంది.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమ తదుపరి ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తామని మదేగౌడ ఆందోళనకారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కర్ణాటకకు వ్యతిరేకంగా వస్తే జైల్‌ భరో కార్యక్రమాన్ని చేపడుతామని కన్నడ చలువలి వటల పక్ష నాయకుడు వటల్‌ నాగరాజ్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X