వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు విమానాల ఢీ- 15 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

పానాజి: గోవా తీరంలో మంగళవారం రెండు నావికా దళంవిమానాలు ఢీకొన్నాయి. నావికా దళం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈవిమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ సంఘటన పానాజికి 35 కిలోమీటర్ల దూరంలో జరిగింది. నావికా దళ దినోత్సవాల సందర్భంగావిన్యాసానికి ఇవి బయలుదేరాయి.

ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు. ప్రమాదంలో రెండువిమానాలు నివాస ప్రాంతంలో కూలిపోయాయి. ఒక విమానం నిర్మాణంలో ఉన్న భవంతిపై కూలింది. అక్కడ పని చేస్తున్న కూలీల్లో ముగ్గురు మరణించారని, మరో 19 మంది గాయపడ్డారని పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కర్నైల్‌ సింగ్‌ చెప్పారు. ఒక్కొక్క విమానంలో ఆరేసి చొప్పున రెండువిమానాల్లో 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరందరూ మరణించారని ఎయిర్‌ ఛీఫ్‌ ఎస్‌. కృష్ణస్వామి చెప్పారు. నావికా దళ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గోవావిమానాశ్రయాన్ని మూసేశారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X