వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు వద్దంటున్న రామారావు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రస్తుతం తాను రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని సిక్కిం గవర్నర్‌గా నియమితులైన వి. రామారావు గురువారంవిలేకరులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామారావు భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు.

ఆయన ఈ నెల 25వ తేదీన సిక్కిం గవర్నర్‌గా పదవీ బాధ్యతలుస్వీకరిస్తారు. రాష్ట్రంలో బిజెపి పరిస్థితి గురించి అడిగినప్పుడు- తాను రాజ్యాంగపరమైన పదవిలో నియతుడినయ్యాయని, ఈ సమయంలో తాను రాజకీయాల గురించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి తనపై పెట్టిన బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తనకు ఈ పదవి కొత్త అని, అయితే తనకు సమస్యలు తెలుసునని,అందువల్ల ఈ బాధ్యతల నిర్వహణ తనకు కష్టం కాదని ఆయన అన్నారు. సిక్కిం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని, కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగు పరచడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X