వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధ్యాహ్న భోజనం పంచాయితీకి
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో డిసెంబర్ 1 నుంచి ప్రారంభించనున్న మధ్యాహ్న భోజన పథక నిర్వహణను పంచాయితీలకు అప్పచెప్పాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆయా గ్రామాల్లోని పంచాయితీలే ఈ పథకాన్ని నిర్వహిస్తే అనేక సమస్యలు తీరుతాయిని ప్రభుత్వం భావిస్తోంది.
తొలుత డ్వాక్రా గ్రూపులకు ఇవ్వాలని..ఆ తర్వాత మండలకేంద్రం నుంచి సరాఫరా చేయాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు పంచాయితీలపై దృష్టి సారించింది. సర్పంచి, హెడ్మాస్టార్,విద్యాకమిటీల అధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఈ మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకోనేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల విద్యా శాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తెలిపారు.
Comments
Story first published: Monday, October 7, 2002, 23:53 [IST]