వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేస్‌ జంటకుస్వర్ణ పతకం

By Staff
|
Google Oneindia TeluguNews

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మికార్టర్‌ కు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారాలకు, దేశాల మధ్య ఘర్షణను తగ్గించేందుకువిశేషంగా కృషిచేసినందుకు గాను జిమ్మికార్టర్‌ కు శాంతి బహుమతిని ప్రకటిస్తున్నట్లు నోబెల్‌ కమిటీ శుక్రవారం తెలిపింది.

జిమ్మికార్టర్‌ ఈ ఏడాది ప్రథమార్థంలో క్యూబాను సందర్శించి క్యాస్ట్రోతో సమావేశమయ్యారు. అమెరికా, క్యూబాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ఐనప్పటికీ క్యాస్ట్రోను కలుసుకొని కార్టర్‌ ఘర్షణలు తగ్గించేందుకు కృషి చేశారు.

కార్టర్‌ భారత్‌ కు కూడా బాగా కావాల్సినవాడు. భారత్‌ తో పాటు వర్థమాన దేశాలపట్ల ఆయనకు కొద్దిగా మమకారం ఎక్కువ. డిసెంబర్‌ 10న జరిగే నోబెల్‌ ప్రదానోత్సవంలో ఆయనకు ఈ అవార్డునుఅందచేస్తారు. అవార్డు కింద 1.7 మిలియన్‌ డాలర్లు లభిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X