వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ సమావేశానికి సిఎల్‌పి డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభను వెంటనే సమావేశపర్చాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) గవర్నర్‌ రంగరాజన్‌ను కోరింది. ఈ మేరకు సిఎల్‌పి నేత డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు శనివారం ఒక వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై, ప్రభుత్వం చేపట్టిన కరువు సహాయ చర్యలపై చర్చించేందుకుఅసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరినట్లు రాజశేఖర్‌ రెడ్డివిలేకరులతో చెప్పారు. రాజ్యాంగంలోని 174 అధికరణ కింద గవర్నర్‌ శాసనసభను సమావేశపర్చవచ్చునని ఆయన చెప్పారు. శాసనసభను సమావేశపర్చాలని తాము ఎన్ని సార్లు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించడం లేదని, దీంతో 174 అధికరణ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని శాసనసభను సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరామని ఆయనవివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X