అసెంబ్లీ సమావేశానికి సిఎల్‌పి డిమాండ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభను వెంటనే సమావేశపర్చాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) గవర్నర్‌ రంగరాజన్‌ను కోరింది. ఈ మేరకు సిఎల్‌పి నేత డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు శనివారం ఒక వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై, ప్రభుత్వం చేపట్టిన కరువు సహాయ చర్యలపై చర్చించేందుకుఅసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరినట్లు రాజశేఖర్‌ రెడ్డివిలేకరులతో చెప్పారు. రాజ్యాంగంలోని 174 అధికరణ కింద గవర్నర్‌ శాసనసభను సమావేశపర్చవచ్చునని ఆయన చెప్పారు. శాసనసభను సమావేశపర్చాలని తాము ఎన్ని సార్లు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించడం లేదని, దీంతో 174 అధికరణ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని శాసనసభను సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరామని ఆయనవివరించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+