వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెస్టిండీస్‌పై భారత్‌ ఘనవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: వెస్టిండీస్‌పై భారత్‌ తొలి క్రికెట్‌టెస్ట్‌లో ఘన విజయం సాధించింది. భారత్‌ వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్‌ 112 పరుగుల తేడాతోవిజయం సాధించింది. స్పిన్‌ మాంత్రికుడు హర్బజన్‌ సింగ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏడువికెట్లు పడగొట్టి భారత విజయానికి బాటలు వేశాడు. మరో స్పిన్నర్‌ కుంబ్లే మూడువికెట్లు తీసుకున్నాడు.
హర్బజన్‌ సింగ్‌ 48 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు.

గతంలో ఇంగ్లాండు బౌలరు బోతమ్‌ 48 పరుగులిచ్చి ఏడువికెట్లు తీసుకున్నాడు. కెప్టెన్‌గా టెస్ట్‌ మ్యాచ్‌ల్లో సౌరబ్‌ గంగూలీకి ఇది 12వవిజయం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగుల భారీ స్కోరు సాధించింది.వీరేంద్ర సెహవాగ్‌ ధాటిగా ఆడి 147 పరుగులు సాధించాడు. ఇందుకు గానుసెహవాగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. రాహుల్‌ ద్రావిడ్‌సెంచరీ సాధించాడు. వరుసగా నాలుగు సెంచరీలు చేసి ద్రావిడ్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 157 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ఖాన్‌ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఫాల్‌ ఆన్‌ ఆడిన వెస్టిండీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగా కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ ఓపెనర్లు గెయిల్‌, హిండ్స్‌ మంచి ప్రారంభాన్నేఅందించారు. గెయిల్‌ 42 పరుగులు, హిండ్స్‌ 40 పరుగులు చేశారు. అయితే ఆ తర్వాత భారత స్పిన్నర్ల ధాటికి వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ నిలదొక్కుకోలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పరుగులు వేగంగా చేయకపోయినప్పటికీవికెట్‌ను కాపాడుకోవడంలో విజయం సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X