వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులాసాపడ్డ వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: నదీజలాల అనుసంధానంపై రాష్ట్ర బిజెపి చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి-గంగ-కావేరి కలపాలని తాము ప్రయత్నిస్తుంటే..దానికి అడ్డపుల్ల వేసేలా కృష్ణా-గోదావరిని కలపాలంటూ రాష్ట్ర బిజెపి డిమాండ్‌ చేయడం హాస్యస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఒక పద్దతి..పాడూ లేకుండా ఆ పార్టీ రాష్ట్ర నేతలు తలో మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు శనివారం తిరుపతిలోవిమర్శించారు.

కేవలం కృష్ణా-గోదావరిని కలపడం వల్ల సమస్యలు తీరవని, గంగ-గోదావరి-కావేరిల అనుసంధానం వల్ల దేశంలో అనేక ప్రాంతాలు కరువుతో సతమతమవ్వాల్సిన బాధ తప్పుతుందనివివరించారు. ఇదే తమ ప్రభుత్వ ప్రాధామ్యాలలో ఇప్పుడు ప్రథమ స్థానం ఆక్రమించిందని ఆయన తెలిపారు. నదుల అనుసంధానం జాతీయ స్థాయిలో జరిగితేవిద్యుత్‌ కోత కూడా ఉండదన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X