వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులాసాపడ్డ వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: రాష్ట్రానికి ఈ ఏడాది మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని అదనంగా కేంద్రం మంజూరు చేసింది. ఈవిషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు వెల్లడించారు. శనివారం ఆయన ప్రధానితో చర్చించాక, ఈవిషయాన్ని విలేకరులకు తెలిపారు. శనివారం నాడు జరిగిన సస్యశ్యామల యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్యనాయుడువిలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉచిత విద్యుత్‌ అంటూ ప్రచారం చేస్తోందని, దానిఅర్థం ఉత్తుత్తి విద్యుతేనని ఆయన ఎద్దవే చేశారు.విద్యుత్‌ పై అటు కాంగ్రెస్‌ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా, ఇటు రాష్ట్రప్రభుత్వమూ 24 గంటల కరెంట్‌ సత్యదూరంగా ప్రవర్తిస్తోందని ఆయనవిమర్శించారు.

విద్యుత్‌ పన్నెండుగంటలు సరిగ్గా సరఫరా చేస్తే చాలని ఆయనవివరించారు. అలాగే ఇప్పుడు అనుసరిస్తోన్న అభివృద్ధి ప్రాధాన్య క్రమాన్ని మార్చాలన్నారు.అర్బన్‌ సెంటర్డ్‌ గా కాకుండా గ్రామీణ ప్రాంతాలను దృష్టిలోపెట్టుకొని అభివృద్ధి పథకాలను రూపొందించాలన్నారు.

త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించనున్నామని ఆయన చెప్పారు. కేంద్రప్రభుత్వం ఇందుకోసం భారీ ప్రణాళికలను రూపొందిస్తుందని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X