వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాత్రలు విజయవంతం: దత్తాత్రేయ

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: పెండింగ్‌ నీటి పారుదల ప్రాజెక్టుల కోసం తాము నిర్వహించిన సస్యశ్యామల యాత్రలువిజయవంతమయ్యాయని బిజెపి నేత, రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రారంభమైన యాత్రలు శనివారం వరంగల్‌కు చేరుకున్నాయి.

పెండింగ్‌ నీటి ప్రాజెక్టులపై యాత్రల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగామని ఆయన చెప్పారు. తమ యాత్రల ద్వారా నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రజల్లో చైతన్యం తేగలిగామని ఆయన చెప్పారు. ఏ విధమైన రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఈ యాత్రలు చేపట్టలేదని, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ యాత్రలు చేపట్టామని ఆయనవివరించారు. వచ్చే రెండేళ్ల వరకు రాష్ట్రంలో ఏ విధమైన ఎన్నికలు లేవని,అందువల్ల యాత్రల నుంచి రాజకీయ లబ్ధి ఆశించడమనేది వట్టి మాటే అవుతుందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X