వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాతీర్‌ కు ఘనస్వాగతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకువిచ్చేసిన మలేషియా ప్రధాని మహాతీర్‌ మహమ్మద్‌ కు ఘనస్వాగతం లభించింది. బుధవారం ఉదయం ప్రత్యేకవిమానంలో సతీసమేతంగా విచ్చేసిన మహాతీర్‌ కు బేగంపేటవిమానాశ్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు ఘనంగాస్వాగతం పలికారు.

హైదరాబాద్‌ లోని హైటెక్‌ సిటీని మహతీర్‌ సందర్శించారు. ముఖ్యమంత్రి తోడురాగా, ఆయన టెక్నాలజీ పార్క్‌ ఆసాంతం పరిశీలించారు. ఐటి, సాప్ట్‌ వేర్‌ రంగాల్లో రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆయన ఆసక్తి చూపారు. అయితే, ప్రోటాన్‌ కార్ల ప్లాంట్‌ పై ఆయన ఎటువంటి హామీ ఇవ్వలేదు. గత ఏడాది మలేషియాకు చెందిన ప్రోటాన్‌ కార్ల కంపెనీవిశాఖపట్నంలో ప్లాంట్‌ ను స్థాపించేందుకు ఆసక్తి చూపి ఆఖరిదశలో వెనక్కితగ్గింది.

అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. చంద్రబాబు పనితీరును ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకోరారు. ఆయన హైదరాబాద్‌ లో రెండు రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X