వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోవిస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్రమంతటా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణా, రాయలసీమలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. కరువుతో సతమతమవుతోన్న రైతులకు, ప్రజానీకానికి ఇది తీపి వార్తే. అయితే, గత మూడు రోజులుగా పడుతోన్న వర్షాల వల్ల రిజర్వాయర్లలోపెద్దగా నీరు చేరకపోవడం మాత్రం నిరాశ కలిగిస్తోంది.

పడుతోన్న వర్షాలు క్యాచ్‌ మెంట్‌ ఏరియాలో కాకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశాయాల్లోని నీటి నిల్వలోపెద్దగా మార్పు లేదు. అయితే, ఈ వర్షాల వల్ల మెట్టప్రాంతంలోని రైతులు వ్యవసాయం చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. ఈ ఏడాది వరి పంట బాగా తగ్గింది. వరి కాకుండా ఇతర పప్పు ధాన్యాలు ఈ వర్షాల వల్ల వేసుకోవచ్చని రైతులకు అధికారులు సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X