వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఐటి రంగంలో పెట్టుబడులుపెట్టేందుకు కృషి చేస్తానని మలేషియా ప్రధాని మహతీర్‌ మహమ్మద్‌ హామీ ఇచ్చారు. మలేషియా వాణిజ్యవేత్తలు హైదరాబాద్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం హైదరాబద్‌విచ్చేసిన మహతీర్‌ గురువారం పని ముగించుకొని తిరిగి మలేషియా వెళ్ళారు. గురువారం ఆయన నగరంలో పలు ప్రాంతాలను సందర్శించారు.

రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలతో సమావేశంఅయి, పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ తో తమ దేశానికి సత్సంబంధాలున్నాయని, రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి తమ వంతు సాయంఅందిస్తామన్నారు.

ప్రోటాన్‌ కార్ల ఫ్యాక్టరీ విషయంలో ఇదమిద్దంగా హామీ ఇవ్వలేదు. కానీ ఈవిషయాన్ని తప్పకుండా పరిశీలిస్తానని మాట ఇచ్చారు. హార్డ్‌ వేర్‌ రంగంలో కూడా ఆయన ఆసక్తిని కనబర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X