వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత కరెంట్‌పై ముందుకే: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర రైతులకు ఉచితవిద్యుత్‌ను అందించడం అసాధ్యమేమీ కాదని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. రైతులకు ఉచితవిద్యుత్‌ సరఫరా పంజాబ్‌లో వికటించినా ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితవిద్యుత్‌ అందిస్తామని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఉచిత విద్యుత్‌ హామీపై శుక్రవారం సిఎల్‌పి సమావేశంలో చర్చించారు. శనివారం జరిగే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) కార్యవర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు రానున్న దృష్ట్యా తన వాదనను బలంగా ఉంచేందుకు సిఎల్‌పి శుక్రవారం చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వంపై 300కోట్ల రూపాయల భారం పడే ఉచితవిద్యుత్‌ను రైతులకు అందించి తీరుతామని ఆయన చెప్పారు. ఉచితవిద్యుత్‌ సరఫరా హామీ సాధ్యాసాధ్యాలపై పిసిసి సమావేశంలోవివరిస్తామని ఆయన చెప్పారు. ఉచిత విద్యుత్‌ హామీని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాదాయంలో ఒక శాతం,ట్రాన్స్‌కో ఆదాయంలో మూడు శాతం ఖర్చు చేయాల్సి వుంటుందని, ఇంధన శాఖలో పలు చోట్ల ఖర్చులను తగ్గించడం ద్వారా ఈ లోటును భర్తీ చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X