వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి రౌండ్‌ డ్రా చేసుకున్న ఆనంద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభను తొలగించడానికి శ్రీనగర్‌కుసీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ను పంపాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆయన ఆదివారంనాడుపీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌తో చర్చలు జరుపుతారు.

జమ్మూ కాశ్మీర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్‌ను, ఇతరసీనియర్‌ పార్టీ నేతలను సంప్రదించిన అనంతరం మన్మోహన్‌ సింగ్‌ను అక్కడికి పంపాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శిఅంబికా సోనీ శనివారం విలేకరులకు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గడువేదీ లేదనిఅంటూ తగిన విధంగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని రాజకీయ పార్టీలకు జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ గిరీష్‌సి. సక్సేనా పిలుపునిచ్చిన నేపథ్యంలో మన్మోహన్‌ సింగ్‌ను అక్కడికి పంపాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంప్రతింపులు జరపడానికి మన్మోహన్‌ సింగ్‌ జమ్మూ కాశ్మీర్‌ వెళ్తున్నట్లుఅంబికా సోనీ తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X