వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుకాల్పుల్లో జిన్నా హతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రైతులకు ఉచితవిద్యుత్‌ను అందిస్తామనే హామీపై పార్టీ అధిష్ఠానవర్గం అనుమతి తీసుకోవాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) సీనియర్ల సమావేశం నిర్ణయించింది. శనివారం ఇక్కడ జరిగిన పిసిసి కార్యవర్గ సభ్యుల,సీనియర్ల సమావేశం వివరాలను సమావేశానంతరం పార్టీ అధికార ప్రతినిధికె. రోశయ్య విలేకరులకు వెల్లడించారు.

ఉచిత విద్యుత్‌విషయమై పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీకి నివేదించాలని, ఆ కమిటీ ఆమోదించిన తర్వాత ఉచితవిద్యుత్‌ సరఫరా హామీ ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. ఉచితవిద్యుత్‌ సరఫరా హామీపై పార్టీ సీనియర్లు విస్తృతంగా చర్చించారు. ఈ హామీవిషయంలో ఒక పద్ధతిని పాటించాలని నిర్ణయించినట్లు రోశయ్య తెలిపారు. రాష్ట్రంలోవిద్యుత్‌ లభ్యతను, రైతులకు అందించాల్సినవిద్యుత్‌ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత హామీలు ఇవ్వడం సబబుగా ఉంటుందని రోశయ్య అన్నారు.

కరువుపై, ప్రభుత్వ కరువు సహాయక చర్యలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వంవిఫలమైందని, పై నుంచి కింది స్థాయి దాకా కరువు సహాయక చర్యలుఅందించడంలో చలనం లేదని సమావేశంవిమర్శించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X